News January 26, 2025

HYD: చిట్టి భరతమాత.. అదుర్స్ కదూ!

image

రిపబ్లిక్ డే వేడుకలు గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పరిధి ఆరుట్లకు చెందిన శ్రుతి తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమార్తెను భరతమాతగా అలంకరించి వావ్ అనిపించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

Similar News

News February 6, 2025

పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.

News February 6, 2025

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

image

శంషాబాద్‌లో కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. రాళ్ల‌గూడ విలేజ్ వ‌ద్ద ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా 55 మీట‌ర్ల మేర ప్ర‌హ‌రీ నిర్మించారు. స‌ర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశార‌ని రాళ్ల‌గూడ విలేజ్ ప‌రిస‌ర ప్రాంతాల లేఔట్‌ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 6, 2025

సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం

image

సికింద్రాబాద్‌ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్‌ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!