News December 2, 2024
HYD: చుక్కా రామయ్య ఆరోగ్యంపై హరీశ్రావు ఆరా

నల్లకుంటలోని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆరా తీశారు. అంబర్పేట MLA కాలేరు వెంకటేశ్తో కలిసి హరీశ్రావు ఆయనతో ముచ్చటించారు. గత నెల 20న చుక్కా రామయ్య పుట్టినరోజు రాలేకపోయానని తెలిపారు. దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు.
Similar News
News February 10, 2025
HYD: నుమాయిష్కు 80వేల మంది

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు సందర్శకులు భారీగా తరలివెళ్తున్నారు. జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్కు లక్షల సంఖ్యలో సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో 80 వేల మంది నుమాయిష్ను సందర్శించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 15న నమాయిష్ ముగియనుంది.
News February 10, 2025
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్డిపల్లిలో 14.2℃, తాళ్లపల్లి 14.5, చందనవెల్లి 14.7, చుక్కాపూర్ 14.8, ఎలిమినేడు, కాసులాబాద్ 15.5, రాజేంద్రనగర్ 15.7, రాచలూరు, కేతిరెడ్డిపల్లి, తొమ్మిదిరేకుల 15.9, కొందుర్గ్, వెల్జాల 16.1, ప్రోద్దటూర్, సంగెం 16.3, వైట్గోల్డ్ SS 16.4, కడ్తాల్, మంగళపల్లి 16.5, యాచారం, మీర్ఖాన్పేట 16.7, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, కందువాడలో 16.8℃గా నమోదైంది.
News February 10, 2025
శంషాబాద్ నుంచి కుంభమేళాకు తరలివెళ్తున్న ప్రజలు

ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు వృద్ధులు, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆదివారం అంతర్జాతీయ విమాన సర్వీసులో 84,593 మంది ప్రయాణించినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.