News June 18, 2024
HYD: చెత్త డబ్బాలు క్లీన్ చేయట్లేదు..!

GHMC పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. అందుకు దాదాపు రూ.3కోట్లు వెచ్చిస్తోంది. ఏర్పాటు చేశాక నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ వద్ద డబ్బాల్లోని చెత్తను ఎవరూ తొలగించలేదు. కొన్నేళ్లుగా ఇలానే వ్యర్థాలను ఉంచారు. GHMC, రాంకీ సంస్థలు నువ్వంటే నువ్వని చెప్పుకొంటూ బాధ్యతను విస్మరిస్తున్నాయి.
Similar News
News January 24, 2026
నాంపల్లి అగ్నిప్రమాదం: ప్రాణాలకు తెగించి వెళ్లినా.. తిరిగిరాని ముగ్గురు!

నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. లోపల ఉన్న వారిని కాపాడేందుకు మేనేజర్ మహమ్మద్ హుస్సేన్, ఇంతియాజ్తో పాటు మరొక వ్యక్తి సాహసించి లోపలికి వెళ్లారు. దురదృష్టవశాత్తు వారు తిరిగి రాలేదు. బాధితుల్లో 60 ఏళ్ల వృద్ధురాలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ, మంటల మధ్య వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
News January 24, 2026
HYD: TDR కావాలా.. ఇవి తెలుసుకోండి!

మీ భూమి చెరువుల పరిధిలో ఉంటే లేదా రోడ్డు వెడల్పులో పోతే ప్రభుత్వానికి అప్పగించి TDR పొందవచ్చు. నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తున్నారు. టైటిల్ వివాదాలున్నా TDR బ్యాంక్లో మీ వాటా భద్రంగా ఉంటుంది. ఇప్పటివరకు GHMCలో దాదాపు 1070 ఎకరాలకు పైగా TDR ఇచ్చారు. అందులో చాలా వరకు వాడగా ఇంకా 316 ఎకరాల TDR అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారా మీరు కూడా మీకు కావాల్సిన వారితో బేరం కుదుర్చుకుని వీటిని అమ్ముకోవచ్చు.
News January 24, 2026
HYD: బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత

గ్రేటర్ హైదరాబాద్ BJPలో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండే చంపాపేట కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగా మధుసూదన్ రెడ్డి చనిపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


