News April 1, 2025

HYD: చెరువుల్లో నీటి, మట్టి నాణ్యత పరీక్షలు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 చెరువుల్లో నీటి, మట్టి నాణ్యతను పరీక్షించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. దుర్గం చెరువు, సున్నం చెరువు సహా అనేక చెరువులు ఇందులో ఉన్నాయి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించి చెరువులను చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

Similar News

News September 18, 2025

ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.

News September 18, 2025

HYD: ప్రాణాలు పోతున్నా.. మారని పరిస్థితి..!

image

హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్‌లో పడి అనేక మంది ప్రాణాలు పోతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడి అనేక మంది మరణించారు. ఇటీవల ఓ చిన్నారి సైతం మ్యాన్‌హోల్‌లో పడింది. అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయి. బహదూర్‌పుర నుంచి కిషన్‌బాగ్ రోడ్డులో ఈ పరిస్థితి నిర్లక్ష్యానికి నిదర్శనం.

News September 18, 2025

JGTL: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆరోగ్యం కోసం నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా చూయించుకోవాలన్నారు. MLA సంజయ్ కుమార్, DMHO ప్రమోద్ కుమార్, తదితరులున్నారు.