News November 4, 2024

HYD: చెరువుల పునరుద్ధరణకు హైడ్రా స్టడీ టూర్..!

image

చెరువుల పునరుద్ధరణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరుకు స్టడీ టూర్ వెళ్లనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా మరి కొంతమంది ఇందులో పాల్గొననున్నారు. అక్కడచెరువుల పునరుజ్జీవం ఎలా జరిగిందో స్టడీ చేస్తారు. ఈ టూర్ అనంతరం ఇక్కడకు వచ్చి బాచుపల్లిలోని ఎర్రకుంటచెరువు, మాదాపూర్ సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువుల పునరుద్ధరణ చేపడతారు.

Similar News

News November 26, 2025

శివారులో మాయమైపోతున్నయమ్మ పల్లెలు

image

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని పెద్దలు చెప్పేవారు.. అయితే ఇపుడు నగర శివారులో ఉన్న పల్లెలు మాయమవుతున్నాయి. అవి పట్నాలుగా కాదు.. ఏకంగా నగరంగా మారిపోతున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం GHMCలో విలీనం చేస్తూనే ఉంది. అప్పట్లో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హైదరాబాద్ నగరం 2వేల చదరపు కిలోమీటర్లున్న నగరంగా మారుతోందంటే ఎన్ని పల్లెలు మాయమై ఉంటాయో ఆలోచించండి.

News November 26, 2025

HYD: లోకల్ బాడీల్లో BRS ‘డబుల్ స్ట్రాటజీ’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమి తర్వాత, GP ఎలక్షన్స్‌లో గెలవడానికి BRS ప్రయత్నాలు మొదలెట్టింది. కాంగ్రెస్ పాలనలో GPలకు నిధుల కొరత, 42% BC కోటా అమలులో వైఫల్యాలని చెబుతూ ప్రచారంలో మెయిన్ ఎజెండాగా ప్లాన్ చేసింది. 2వ ఎజెండా ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపడం. KTR ఇప్పటికే ‘HILT’ పాలసీలో లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని లేవనెత్తారు. వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

News November 26, 2025

HYD: ఎందుకీ విలీనం.. ప్రజలకేం ప్రయోజనం!

image

నగరం చుట్టూ ఉన్న 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే ఈ విలీనం వల్ల ప్రజలకేం ప్రయోజనం? అని సామాన్యుల మదిలో మెదిలో ప్రశ్న. గతేడాది గ్రామాలను మున్సిపాలకటీల్లో కలిపిన సర్కారు.. ఇపుడు మున్సిపాలిటీలను గ్రేటర్‌లో కలపాలని నిర్ణయించింది. మా పల్లెలను GHMCలో కలిపితే మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.