News March 17, 2025

HYD: జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

image

చంచల్‌గూడ జైలులో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు తన్వి యాదవ్, రేవతిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్‌ను ఇచ్చింది. కాగా.. పోలీసులు తన్వి యాదవ్‌తో పాటు రేవతిలను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయగా పిటిషన్‌ను తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేసింది.

Similar News

News October 19, 2025

రాజంపేట: కొద్దిరోజుల్లో పెళ్లి.. అంతలోనే మృతి

image

మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు మృత్యుఒడికి చేరుకున్న విషాదకర సంఘటన శనివారం రాత్రి మాధవరం ప్రాంతంలో జరిగింది. రాజంపేట పట్టణం నూనెవారిపల్లెకు చెందిన శరత్ నాయుడు(29) నేషనల్ హైవే శాఖలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఓ ఎక్స్‌ప్రెస్‌లో రాజంపేటకు వస్తుండగా కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో డోర్ వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

News October 19, 2025

సహజీవనంలో మహిళలకు ఉండే హక్కులేంటి?

image

ప్రస్తుతం మన దేశంలోనూ సహజీవన వ్యవస్థ పెరుగుతోంది. ఇందులో మహిళకు శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులు, ఫోటోలు, వీడియోలు లీక్ అయితే చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఆ జంటకు పుట్టే పిల్లలకు వారసత్వఆస్తిలో హక్కు ఉంటుందని కోర్టు గతంలో స్పష్టంచేసింది. పరస్పర సమ్మతి లేకుండా బంధాన్ని తెంచుకుంటే మెయింటెనెన్స్ అలవెన్స్ పొందే హక్కూ ఉంది. ఈ బంధంలోకి వెళ్లే ముందు మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News October 19, 2025

అనంతగిరిలో అధిక పార్కింగ్ వసూళ్లు..!

image

వికారాబాద్ అనంతగిరి ఆలయం పార్కింగ్‌లో భక్తుల నుంచి అధిక వసూళ్లు చేస్తున్నారని భక్తులు వాపోయారు. పార్కింగ్ నిర్వాహకులను పార్కింగ్ రుసుము ఎంత అని ప్రశ్నించగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక రేటు, వీకెండ్ శని, ఆదివారాలల్లో అంతకు మించి అధిక రేట్లు తీసుకుంటామని పేర్కొన్నారు. కారు పార్కింగ్ రూ.20 అయితే రసీదు ఇచ్చి రూ.30 తీసుకున్నారని భక్తులు తెలిపారు. అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.