News August 31, 2024
HYD: జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తాం: మంత్రి

తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆద్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు కథలు, నాటికలు వేసే జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారన్నారు.
Similar News
News February 15, 2025
HYD: వాటిని గుర్తిస్తే ఫిర్యాదు చేయండి: డీజీ

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని డీజీ డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.
News February 15, 2025
మీర్పేట్: అధ్యక్షురాలికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతి హిల్స్లో నివాసం ఉంటున్న తెలంగాణ జాగృతి నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు మిర్యాల పావనిని ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
News February 15, 2025
HYD: ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటండి: ఎంపీ

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వృక్షార్చన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.