News April 19, 2024

HYD: జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్ల తొలగింపు: ఈసీ

image

హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. చాంద్రాయణగుట్టలో 59,289 ఓట్లు, యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Similar News

News October 20, 2025

నగరంలో దీపావళిపై ఆర్టిఫిషియల్ వెలుగులు

image

దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించే ఆచారం ఇప్పుడు నగరంలో తగ్గుముఖం పడుతోంది. కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి, బేగంబజార్‌లో విక్రయిస్తున్న ఆర్టిఫిషియల్ లైట్లే ఆకర్షిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌‌లో లభించే వివిధ ఆకృతుల దీపాలతో ఇళ్లు అలంకరిస్తున్నారు. మట్టి ప్రమిద అజ్ఞానం తొలగించి జ్ఞాన వెలుగు ప్రసరింపజేయాలనే భావనతో వచ్చిన సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు.

News October 20, 2025

HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

image

ప్రగతినగర్‌లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్‌కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్‌కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్‌ఛార్జికి చెప్పారు. కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.

News October 20, 2025

ఖైరతాబాద్‌లో రేపు సాయంత్రం సదరోత్సాహం

image

ఖైరతాబాద్‌లో రేపు సదర్ సందడి ఉంటుంది. సా.7 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ వద్ద ఈ వేడుక నిర్వహిస్తారు. దీపావళి పండుగ మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని.. 8 దశాబ్దాలుగా సదర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళారపు చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు. స్థానికులు వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.