News August 14, 2024

HYD: జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు

image

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన 10 నెలల తర్వాత ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మూసివేసిన పాత ఇనుప దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు లంచం తీసుకోవడమే కాకుండా మరింత కావాలని డిమాండ్ చేశారని వచ్చిన ఫిర్యాదుతో సీబీఐ హైదరాబాద్ విభాగం స్పందించింది. జీఎస్టీ సూపరింటెండెంట్ వి.డి.ఆనంద్ కుమార్, ఇన్‌స్పెక్టర్ మనీశ్ శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 28, 2025

HYD: సిబ్బంది లేమి.. నియామకాలేవి: పద్మనాభరెడ్డి

image

రాష్ట్రంలోని 25 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేమి తీవ్రంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి లేఖ రాసింది. 1,413 మంది కావాల్సిన చోట 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 22 ఆస్పత్రుల్లో ఒక్క నియామకం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. సిబ్బంది లేక దవాఖానాలు మూతబడి, వాటిలో కొన్ని చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1,302 పోస్టులను భర్తీ చేసి ఆస్పత్రులు ప్రారంభించాలన్నారు.

News November 28, 2025

HYD: మంచినీరు వృథా చేస్తే.. కాల్ చేయండి!

image

HYDలో జలమండలి సరఫరా చేసే మంచినీటిని కార్లు, బైకులు కడగటానికి, రోడ్లు కడగటానికి ఉపయోగించడం, మోటార్లు పెట్టి నిర్మిస్తున్న ఇళ్లకు క్యూరింగ్ చేయడం లాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించి భారీ జరిమానా వేస్తామని జలమండలి హెచ్చరించింది. ఎవరైనా చూస్తే వెంటనే ఫొటో తీసి, 155313, HMWSSB యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.

News November 28, 2025

మెట్రో ప్రయాణికులకు స్మార్ట్ లాకర్ల సేవలు

image

​L&T మెట్రో రైల్, TUCKITతో కలిసి HYDలోని మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సేవలను ప్రారంభించింది. ఇందులో లగేజీ, హెల్మెట్‌లు, షాపింగ్ బ్యాగ్‌లను భద్రపరుచుకుని హ్యాండ్స్‌ఫ్రీగా ప్రయాణించొచ్చు. QR కోడ్ స్కాన్ చేసి, లాకర్ సైజు ఎంచుకుని 30 సెకన్లలో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్‌సిటీ స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.