News August 10, 2024
HYD జూబ్లీహిల్స్లో వ్యభిచార గృహంపై దాడి

HYD జూబ్లీహిల్స్లోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకుడు చంద్రశేఖర్, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. స్రవంతి నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. విటులు ఖమ్మంకి చెందిన నాగేశ్వరరావు, షేక్ సైదులు, ప్రేమ్నగర్కు చెందిన ఎర్ర రాజుగా గుర్తించారు.
Similar News
News October 16, 2025
ఖమ్మం: పెండింగ్ ఓటర్ల దరఖాస్తులు పరిష్కరించాలి

ఓటరు జాబితా, బూత్ స్థాయి అధికారుల నియామకంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. బీఎల్ఓలకు గుర్తింపు కార్డులు, నూతన ఓటర్లకు ఐడీ కార్డులను త్వరగా పంపిణీ చేయాలని సీఈవో సూచించారు.
News October 16, 2025
టీటీడీ ఆలయానికి 20 ఎకరాల గుర్తింపు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థల అప్పగింత చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వాళ్లినాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి సమీక్షించారు. అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలం గుర్తించి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News October 16, 2025
ఖమ్మం: భారంగా మారిన ఇసుక ధరలు.!

ఖమ్మం జిల్లాలో ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక రూ.2,000 నుంచి 2,500 పలుకుతోంది. ఒక ఇంటి నిర్మానికి సుమారు 80 టన్నుల ఇసుక అవసరం అయితే దీనికే రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ధరలను నియంత్రించాల్సిన జిల్లా అధికారులు వారికేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ ప్రాంతంలో ఇసుక ధరలు ఎలా ఉన్నాయి. COMMENT