News April 7, 2025
HYD: జోరుగా LRS ప్రక్రియ.. రూ.152 కోట్లు

HMDA పరిధిలో LRS ప్రక్రియ జోరందుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ అందుబాటులో ఉండగా, ఇప్పటికే 45వేలకుపైగా LRS అప్లికేషన్లకు దరఖాస్తుల ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు రూ.152 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 21, 2025
తంగళ్ళపల్లి: పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్ను సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి ఆయుధాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ రౌడీ షీటర్స్ను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్సై ఉపేంద్ర చారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
హనుమకొండ: తెలంగాణ గోల్డ్ కప్ టీ-20 టోర్నమెంట్కు సెలక్షన్స్

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ గోల్డ్ కప్ 2025 T20 టోర్నమెంట్ కోసం జిల్లాలో క్రికెట్ జట్టు ఎంపికలు జరుగుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. 23న వరంగల్ జిల్లా వారికి ఓ-సిటీ గ్రౌండ్స్లో, హనుమకొండ జిల్లా వారికి JNS స్టేడియంలో సెలక్షన్ ఉంటుందని, క్రీడాకారులు తప్పక హాజరుకావాలని వారు కోరారు.


