News April 7, 2025
HYD: జోరుగా LRS ప్రక్రియ.. రూ.152 కోట్లు

HMDA పరిధిలో LRS ప్రక్రియ జోరందుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ అందుబాటులో ఉండగా, ఇప్పటికే 45వేలకుపైగా LRS అప్లికేషన్లకు దరఖాస్తుల ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు రూ.152 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 27, 2025
అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం
News October 27, 2025
ALERT.. నల్గొండ జిల్లాపై ‘మొంథా’ ప్రభావం

రానున్న 2,3 రోజులు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం ఆమె ఈ విషయమై సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దన్నారు.
News October 27, 2025
కరూర్ తొక్కిసలాటపై CBI దర్యాప్తు ప్రారంభం

TN కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును CBI అధికారంగా చేపట్టింది. FIRను రీ-రిజిస్టర్ చేసింది. ఇందులో TVK జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సహా పలువురు పేర్లున్నాయని, త్వరలో అరెస్టులు జరగొచ్చని సమాచారం. ఈ కేసును తొలుత SIT దర్యాప్తు చేయగా, CBIకి ఇవ్వాలని TVK సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కేసు దర్యాప్తును ధర్మాసనం CBIకి అప్పగించింది. కాగా బాధిత కుటుంబాలను విజయ్ ఇవాళ <<18105218>>పరామర్శించనున్నారు<<>>.


