News March 25, 2024

HYD: టీవీ నటులకు పురస్కారాల ప్రదానం 

image

ప్రాచీన లలిత కళలు.. మన భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య జీవన సాంప్రదాయ కళలని, వాటిని పరిరక్షించుకోవాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సూచించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ రమణారావు అధ్యక్షతన HYD రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో శివరాత్రి స్వర్ణ నంది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీవీ నటులకు పురస్కారాలు అందించారు.

Similar News

News October 31, 2025

PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

image

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్‌ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్‌తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.

News October 30, 2025

సజ్జనార్ ఆకస్మిక తనిఖీ: సాంకేతికత వాడకంపై ఆదేశం

image

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం బంజారాహిల్స్‌లోని కమిషనర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిన్, ఐటీ, కంట్రోల్ రూమ్ సహా వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. పీసీఆర్‌లో ఇంటిగ్రేటెడ్ పెట్రోలింగ్ సిస్టమ్, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయంపై ఆరా తీశారు. సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. విధుల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలన్నారు

News October 30, 2025

BREAKING: తుఫాన్ ఎఫెక్ట్.. HYD శివారులో మహిళ మృతి

image

మొంథా తుఫాను కారణంగా HYD శివారులో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మజీద్‌పూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.