News April 12, 2024

HYD: ట్యాంకర్లకు డిమాండ్.. ఇంటి ఓనర్లకు నోటీసులు!

image

జలమండలి కీలక నిర్ణయం తీసుకొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 31,706 మంది నీటి ట్యాంకర్ల‌ను ఆశ్రయిస్తున్నట్లు గుర్తించింది. భూగర్భ జలాలు, బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల డిమాండ్‌కు ప్రధాన కారణమని తేల్చారు. ఇటువంటి వారికి అవగాహన కల్పించడం కోసం NGO ప్రతినిధులను ఇంటికి పంపి అవగాహన కల్పించనున్నారు. నీటి సంరక్షణకు ఇంటి యజమానులు ఇంకుడు గుంతలు నిర్మించుకొనేలా నోటీసులు అందజేయనున్నారు.
SAVE WATER

Similar News

News November 1, 2025

HYD: KCR పదేళ్లు దోచుకున్నాడు: జేఏసీ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం HYD బషీర్‌బాగ్‌లో జాక్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందన్నారు. KCR 10ఏళ్లలో దోపిడీ, నిరంకుశ పాలనను సాగించారని, BRSను ఓడించాలని ప్రజలను కోరారు.

News November 1, 2025

జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఇప్పటి వరకు 15 కేసులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్, BRS, BJP నాయకులు తమ ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలపై నిఘా వేసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.

News November 1, 2025

HYD: సన్న బియ్యం సిద్ధం.. రేషన్ షాపులకు వెళ్లండి..!

image

నగర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 653 రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. 17,102 టన్నుల సన్న బియ్యం నవంబరులో పంపిణీ చేయనున్నట్లు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. 30,42,056 మంది లబ్ధిపొందుతారని వివరించారు. 8,500 టన్నుల బియ్యం రేషన్ షాపుల్లో మొదటి విడతగా సిద్ధంగా ఉన్నాయన్నారు.