News April 12, 2024
HYD: ట్యాంకర్లకు డిమాండ్.. ఇంటి ఓనర్లకు నోటీసులు!

జలమండలి కీలక నిర్ణయం తీసుకొంది. గ్రేటర్ హైదరాబాద్లో 31,706 మంది నీటి ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నట్లు గుర్తించింది. భూగర్భ జలాలు, బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల డిమాండ్కు ప్రధాన కారణమని తేల్చారు. ఇటువంటి వారికి అవగాహన కల్పించడం కోసం NGO ప్రతినిధులను ఇంటికి పంపి అవగాహన కల్పించనున్నారు. నీటి సంరక్షణకు ఇంటి యజమానులు ఇంకుడు గుంతలు నిర్మించుకొనేలా నోటీసులు అందజేయనున్నారు.
SAVE WATER
Similar News
News November 26, 2025
HYD: ఎందుకీ విలీనం.. ప్రజలకేం ప్రయోజనం!

నగరం చుట్టూ ఉన్న 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే ఈ విలీనం వల్ల ప్రజలకేం ప్రయోజనం? అని సామాన్యుల మదిలో మెదిలో ప్రశ్న. గతేడాది గ్రామాలను మున్సిపాలకటీల్లో కలిపిన సర్కారు.. ఇపుడు మున్సిపాలిటీలను గ్రేటర్లో కలపాలని నిర్ణయించింది. మా పల్లెలను GHMCలో కలిపితే మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
News November 26, 2025
BIG BREAKING: HYDలో బోర్డు తిప్పేసిన IT కంపెనీ

హైదరాబాద్లో మరో ఐటీ కంపెనీ ఘరానా మోసం బయటపడింది. మాదాపూర్లోని NSN ఇన్ఫోటెక్లో శిక్షణ–ఉద్యోగం పేరుతో రూ. లక్షల్లో వసూలు చేశారు. 400 మందిలో ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూళ్లు చేసి, చివరకు బోర్డు తిప్పేసినట్లు బాధితులు వాపోయారు. కంపెనీ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. బాధితులు మాదాపూర్ PS, సైబరాబాద్ EOWలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


