News July 24, 2024

HYD: ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామని రూ.3.5 లక్షలు లూటీ

image

ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామని సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు లూటీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD చెందిన వ్యాపారవేత్తకు ఓ లింక్ ద్వారా క్వాంటమ్ క్యాపిటల్ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. మొదటగా బిట్ కాయిన్ పై కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.3.5 లక్షలు పెట్టుబడి మోసపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Similar News

News October 29, 2025

KPHBలో RAIDS.. మహిళలు, యువతులు అరెస్ట్

image

కూకట్‌పల్లిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ACP రవికిరణ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు KPHB మెట్రో స్టేషన్, పుల్లారెడ్డి స్వీట్ షాప్, మెట్రో పరిసర ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. యువకులు, వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న 11 మంది మహిళలు, యువతులను అదుపులోకి తీసుకొన్నారు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. ఆరుగురికి 7 రోజుల రిమాండ్‌ విధించారు.

News October 29, 2025

HYDలో భారీ వర్షం.. ఈ మెసేజ్ వచ్చిందా?

image

HYD, RR, MDCL జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌లు పంపింది. మీకూ వచ్చాయా?

News October 29, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

image

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా బుధవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్ అధ్యక్షతన పరిశీలన జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈసీఐ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ కొనసాగింది.