News August 16, 2024
HYD: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు టెండర్ల ఆహ్వానం

గ్రేటర్ HYDలో వివిధ కాలనీల్లో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సదుపాయాలు కల్పించకపోవడంతో వారు వాటిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో వాటిని సమకూర్చేందుకు GHMC సిద్ధమైంది. ప్రస్తుతం శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు టెండర్లు పూర్తి చేసి పరికరాలను సమకూర్చుకొని అమర్చనుంది.
Similar News
News July 7, 2025
HYD: యుక్త వయసులో మెదడుపై ప్రభావం!

యుక్త వయసులోనే యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్, మద్యం మత్తు, మరోవైపు సైబర్ మోసం, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకోవడంతో ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం, ఒళ్లు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మందికి పైగా ఈ నెలలో ఎర్రగడ్డ, ఉస్మానియా వైద్యులను సంప్రదించడం ఆందోళనకరం.
News July 6, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 105 మందిపై చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.
News July 6, 2025
లోకేశ్తో KTR పదే పదే చర్చలు: సామ రామ్మోహన్

సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు కేటీఆర్ ప్రతిసవాళ్లు విసరడం హాస్యస్పదమని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద రేపు చర్చకు రావాలని KTRకు సవాల్ విసిరారు. రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. లోకేశ్తో కేటీఆర్ పదే పదే రహస్య మంతనాలు జరపడంపై కూడా సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ డిమాండ్ చేశారు.