News June 4, 2024

HYD: డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, BRS

image

HYD ఎంపీ స్థానంలో కాంగ్రెస్, BRS డిపాజిట్లు కోల్పోయాయి.ఇక్కడ పోలైన మొత్తం ఓట్లలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 61.28% ఓట్లతో గెలుపొందారు. BJP అభ్యర్థి మాధవీలతకు 29.98% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్‌కు 5.83%, BRS అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు 1.73% ఓట్లు రాగా డిపాజిట్లు కోల్పోయారు. ఒవైసీకి 6,61,981, మాధవీలతకు 3,23,894, సమీర్‌కు 62,962, శ్రీనివాస్‌కు 18,641 ఓట్లు వచ్చాయి.

Similar News

News December 21, 2025

HYD: రేపు నాట్కో పరిశ్రమలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’

image

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వేళ అనుసరించాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 22న మేకగూడలోని నాట్కో పరిశ్రమ ఆవరణలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాద సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశంపై సిబ్బందికి, అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

News December 21, 2025

చలి గుప్పెట్లో ఉమ్మడి రంగారెడ్డి.. 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. శనివారం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 5.8, మౌలాలిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 20, 2025

22వ తేదీ నుంచి యథావిధిగా ప్రజావాణి: నారాయణ రెడ్డి

image

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈనెల 22 నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులతో హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.