News March 30, 2025

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 222 మంది చిక్కారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 222 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 163 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 48 నాలుగు చక్రాల వాహనాలు, 2 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News October 28, 2025

HYD: ఇంటింటికీ వెళ్లి మాగంటి సునీత ప్రచారం

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో వెంగళరావునగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు ఈరోజు ప్రచారం చేపట్టారు. సిద్ధార్థనగర్ ఏజీ కాలనీలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. BRSకు ఓటు వేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

News October 28, 2025

HYD: జూబ్లీహిల్స్‌లో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..!

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా నేడు ఉపఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించింది. TPCC ఇన్‌ఛార్జ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొని, నేతలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, గ్రేటర్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఇక ఎన్నికల వరకు అందరూ జూబ్లీహిల్స్‌లోనే ఉంటూ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.

News October 28, 2025

HYD: చున్నీతో గొంతు బిగించి భర్తను చంపింది..!

image

HYD బాలాపూర్ మండలం మీర్‌పేట్ PS పరిధిలో విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్‌మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో భార్య సంధ్య నిందితురాలని తేలింది. మద్యం తాగి, వేధించే భర్తతో నిత్యం గొడవ జరుగుతుండడంతో అక్టోబర్ 19న చున్నీతో గొంతు బిగించి చంపినట్లు సంధ్య ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.