News February 11, 2025

HYD: డ్రగ్స్ పట్టేందుకు 120 జాగిలాలకు శిక్షణ

image

నగరంలో డ్రగ్స్ మూలాలపై ANB యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. బాంబు తరహాలో నార్కిటిక్స్ డాగ్ స్క్వార్డును అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. సుమారు 120 జాగిలాలను అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలు డ్రగ్స్ మూలాలను సైతం పసిగట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

అన్నవరంలో ఆగని అపచారాలు!

image

అన్నవరం సత్యదేవుని ఆలయ సిబ్బంది వ్యవహారశైలిపై భక్తులు మండిపడుతున్నారు. కేశఖండశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ క్షురకుడిని ఈవో త్రినాథరావు సస్పెండ్ చేశారు. గురువారం రాత్రి వసతి గదుల కోసం సీఆర్వో కార్యాలయానికి వెళ్లిన వారి పట్ల ఓ ఉద్యోగి దురుసుగా ప్రవర్తించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు మారినా సిబ్బంది తీరు మారడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 26, 2025

సంక్రాంతికి రైతుభరోసా..!

image

TG: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News December 26, 2025

ప.గో: ఆడుకోమని వదిలిన తండ్రి.. విగత జీవిగా కొడుకు!

image

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.