News April 4, 2024

HYD: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకు.. తనను మందలించినందుకు కన్న తండ్రినే హత్య చేశాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో జరిగింది. ఆరెంజ్  అవెన్యూలో ఓ ఇంట్లో ఉంటున్న తిరుపతి రవీందర్(65)ను పెట్రోల్ పోసి అతడి కుమారుడు నిప్పంటించాడు. మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే రవీందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కొడుకు కోసం గాలిస్తున్నారు.

Similar News

News December 9, 2025

HYD: ఇపుడు 69.. తర్వాత 152.. ఫ్యూచర్‌లో 400 KM!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపాలిటీల విలీనం తరువాత విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో రవాణా అవసరాలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరంలో మెట్రో రైలును కూడా మహానగర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల నెట్ వర్క్ ఉన్న మెట్రో రెండో దశలో మరో 152 KM పెరిగే అవకాశముంది. 2047 నాటికి మెట్రోను 400 KM పెంచి 623 KMకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

News December 9, 2025

HYD: పడిపోలేదు.. జస్ట్ ఒరిగిందంతే!

image

చూడటానికి యాడ్ బోర్డుపై స్తంభం రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉన్న ఈ విజ్యువల్ పెద్దఅంబర్‌పేట్ NH-65పైది. జులైలో భారీ ఈదరుగాలులు, వర్షం ధాటికి ఈ లైన్ ఏబీ స్విఛ్ స్తంభం కిందపడేది. కానీ బోర్డు పక్కనే ఉండటంతో దానిపై వాలింది. 5నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. హైవేపైన ఉన్నదానికే స్పందనలేకపోతే ఇక గల్లీల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

News December 9, 2025

వాయువేగంతో ‘గ్రేటెస్ట్ హైదరాబాద్‌’.. స్పష్టత ఏది?

image

GHMCలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల <<18508761>>విలీనం<<>> వాయువేగంతో పూర్తైంది. 150 డివిజన్లతో ఉన్న GHMC.. 27 ULBs కలిశాక 12 జోన్లు, 300డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో (నం.266) విడుదల చేసింది. పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు డబుల్ చేయాలని కమిషనర్ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే..మమ్మల్ని GHMCలో ఎందుకు కలిపారో చెప్పడంలేదెందుకని శివారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.