News April 24, 2024
HYD: తగ్గని రద్దీ.. మరికొన్ని స్పెషల్ ట్రైన్లు
HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 30కి పైగా సమ్మర్ స్పెషల్ ట్రైన్లు నడిపిస్తున్నప్పటికీ రద్దీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని రూట్లకు స్పెషల్ ట్రైన్లు నడిపించనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి ముజఫర్పూర్ వెళ్లడానికి ఏప్రిల్ 25 నుంచి జూన్ 27 వరకు మొత్తం 10 ట్రిప్పులు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. మిగతా ట్రైన్ల షెడ్యూల్ సైతం విడుదల చేశారు.
Similar News
News January 22, 2025
HYDలో ఒకే ఒక పోస్ట్.. శాలరీ రూ. 1,25,000
జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1,25,000 వేతనం పొందవచ్చు. ఇటీవల ప్రసార భారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ కింద హైదరాబాద్లో సీనియర్ కరస్పాండెంట్ ఒక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, PG డిప్లొమా, MCJ చేసినవారు అర్హులు. మీడియా రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు లాస్ట్ డేట్: JAN 31.
LINK: https://prasarbharati.gov.in
SHARE IT
News January 22, 2025
HYD: రైల్వే ట్రాక్పై అమ్మాయి తల, మొండెం (UPDATE)
జామై ఉస్మానియాలో అమ్మాయి సూసైడ్ కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో <<15212047>>రైల్ కింద పడి ఆత్మహత్య<<>> చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
News January 22, 2025
HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర
HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.