News August 29, 2024

HYD తర్వాత నల్గొండ జిల్లా వాసులే అధికం

image

నల్గొండ జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తర్వాత మూత్రపిండాల చికిత్స పొందుతున్న వారిలో అధికంగా ఈ జిల్లా వాసులే ఉన్నట్లు ఇటీవల నేమ్స్ ఆసుపత్రి బృందం నిర్వహించిన సర్వేలో తేలింది. జిల్లాలో పీపీపీ పద్ధతిలో 55 పడకల ద్వారా నిత్యం 472 మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. NLG పరిసర ప్రాంతాల్లో ఎక్కువమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది.

Similar News

News October 22, 2025

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలోని వెటర్నరీ & అనిమల్ హస్బెస్టరీ, ఫిషరీష్ డిపార్ట్మెంట్ లలో డేటాఎంట్రీ ఆపరేటర్స్ (3), ఆఫీస్ సబార్డినేట్స్ (38) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి ఎమ్ పానెల్ అయిన ఆసక్తి గల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News October 22, 2025

కొండమల్లేపల్లి: ఆదుకుంటే.. చదువుకుంటాం..

image

కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలైన సైదమ్మ-వెంకటయ్య కుమార్తెలు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూతురు తేజశ్రీకి రామగుండంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఏడాది ఫీజు ₹ 1,22,000 కాగా, ఆమె అక్కకు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం ఫీజు ₹ 1,88,000 చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నారు. దాతలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

News October 22, 2025

నల్గొండ: ఉపాధి పనుల గుర్తింపునకు కసరత్తు

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం నుంచే గ్రామసభల ద్వారా పనులను గుర్తించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో వీటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఉపాధి పనుల గుర్తింపునకు ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నారు.