News January 31, 2025

HYD: తల్లి మృతి.. 9 రోజులు ఇంట్లోనే మృతదేహం

image

వారాసిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. తల్లి మృతి చెందడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కూతుళ్లు 9 రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగుచూసింది. MLA పద్మారావు చొరవతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని గాంధీకి తరలించారు. మృతురాలు శ్రీ లలిత (45) గుర్తించారు. తల్లిని కోల్పోయిన రవళిక (25), అశ్విత (22) కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News

News November 27, 2025

నంద్యాల ఫిజియోథెరపిస్టుకు జాతీయస్థాయి పురస్కారం

image

నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యదర్శి డాక్టర్ శివ బాలి రెడ్డి జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ గౌరవాన్ని పొందారు.
సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రానికి గాను ఆయనకు ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం పురస్కారం లభించింది. జిల్లాలోని ప్రముఖులు డా. శివ బాలి రెడ్డిని అభినందించారు.

News November 27, 2025

భార్యను చంపిన కేసులో భర్తకి జీవిత ఖైదు: శ్రీకాకుళం ఎస్పీ

image

భార్యను చంపిన కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించినట్లు గురువారం శ్రీకాకుళం ఎస్పీ కె.విమహేశ్వరరెడ్డి తెలిపారు. 2018 మార్చి 14వ తేదీన పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జీరు రమణమ్మను అనుమానంతో భర్త వెంకటరమణ కత్తితో దాడి చేసి హత్యచేశాడు. ఘటనపై ముద్దాయిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చి పరారీలో ఉన్న అతడిని తాజాగా కోర్టులో హాజరుపరచగా జీవిత ఖైదు విధించారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.