News April 9, 2025
HYD: తెలుగు యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటి రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 17 వరకు ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, నిఘంటువులు, సంగీత, నృత్య గ్రంథాలు, భారత, భాగవతాలు, ప్రబంధాలు, పురాణాలు, పంచకావ్యాలు, ఇతిహాసాలు, చరిత్ర పంథాలు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను 60% రాయితీతో ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News November 26, 2025
Official: అహ్మదాబాద్లో కామన్ వెల్త్ గేమ్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.
News November 26, 2025
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతలకు పరిరక్షించడంలో పోలీసు యంత్రాంగం సమర్థంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సునీల్ షోరాన్ సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News November 26, 2025
విశాఖ రైల్వే జోన్కు ‘గెజిట్’ గండం..?

దశాబ్దాల పోరాటంతో సాకారమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అధికారిక ‘గెజిట్’ విడుదల కాకపోవడంతో నూతన జోన్గా రూపాంతరం చెందడం లేదు. GM ఆఫీసు, అధికారుల కేటాయింపు జరిగినా.. గెజిట్ రాక డివిజన్ ఇంకా ఈస్ట్ కోస్ట్ జోన్లోనే కొనసాగుతోంది. ఉద్యోగుల సంఖ్య వంటి కీలక అంశంపైనా స్పష్టత రావడం లేదు. అయితే ఈస్ట్ కోస్ట్ పరిధిలో కొత్తగా ఏర్పడిన రాయగఢ డివిజన్ పనులను మాత్రం రైల్వే శాఖ చురుగ్గా పూర్తి చేస్తుండటం గమనార్హం.


