News January 20, 2025
HYD: త్వరలో ఐటీ కారిడార్లలో పాడ్ కార్లు..!

మెట్రో స్టేషన్ నుంచి నేరుగా కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ సంకల్పించింది. ఈ వ్యవస్థలో భాగంగా పాడ్ కార్ లేదా పాడ్ ట్యాక్సీలను పరిచయం చేసి ప్రత్యేక కారిడార్లలో వాటిని నడిపేందుకు రూ.1,480 కోట్ల అంచనా వ్యయంతో DPRను సిద్ధం చేసినట్లు సమాచారం. నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డీపీఆర్ను ప్రభుత్వానికి సమర్పించి నిధులు కోరనుంది.
Similar News
News November 25, 2025
EXCLUSIVE: 15 ఏళ్ల తర్వాత తొలుగుతోన్న ముసుగులు

GHMCలో 15 ఏళ్లుగా ముసుగు కప్పుకున్న విగ్రహాల తెర వీడుతోంది. స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొంది 5 నెలలు గడిచినా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోనూ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేశారు. విగ్రహాలను తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. డిసెంబర్ మొదటి వారంలో మరోచోట విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని సమాచారం.
News November 25, 2025
బల్దియా.. బస్తీమే Kya Kiya?

నేటి GHMC సర్వసభ్య సమావేశాలు అసెంబ్లీ చర్చలను మించేలా ఉన్నాయి. గతంలోనూ నిర్ణీత సమయంలో ఒక అంశం మీద చర్చ జరుగుతుంటే మరోవైపు నిరసనలతో సభ రసాభాసాగా మారింది. ప్రతిసారి ఇదే తంతు అన్న విమర్శలొచ్చాయి. అసలు చర్చ పక్క దారి పడుతోందని కొందరు సభ్యులు మొరపెట్టుకున్నారు. అయితే, <<18381319>>సిటీలోని బస్తీల్లో<<>> సమస్యలు తాండవిస్తున్నాయని, నేడు అయినా వీటిపై చర్చించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
News November 25, 2025
రేపు హైదరాబాద్లో వాటర్ బంద్

నగరానికి తాగునీటిని అందించే కృష్ణ ఫేజ్-1, 2, 3లో పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లు, ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉ.10 గం. నుంచి సా.4 గం. వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. చార్మినార్, వినయ్నగర్, భోజగుట్ట, రెడ్హిల్స్, నారాయణగూడ, ఎస్సార్ నగర్, హయత్నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మీర్పేట్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.


