News April 11, 2024
HYD: త్వరలో సాగర్ ఎమర్జెన్సీ పంపింగ్!

HYD నగరంలో మంచినీటి డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో నెలకు 2.5 లక్షల ట్రిప్పుల నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని, త్వరలో నాగార్జునసాగర్ ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించి నగర ప్రజలకు నీరు అందించనున్నట్లు వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 18, 2025
ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.
News March 18, 2025
సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య యాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, ప్రకాశ్గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బలహీనవర్గాల హక్కుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంని ప్రశంసించారు.
News March 18, 2025
వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.