News March 29, 2024
HYD: త్వరలో 24 గంటలు వాటర్ ట్యాంకర్ నీటి సరఫరా

వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్ తెలిపారు. HYD ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే, ఈ సారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందన్నారు.
Similar News
News October 15, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడి సిబ్బందికి వాకీటాకీలు

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు సమాచారం అందించుకోవడానికి ఇబ్బందులెదురయ్యేవి. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వాకీటాకీలు అందజేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేయవచ్చు. దీంతో భక్తుల ఇక్కట్లకు ఫుల్స్టాప్ పడనుంది.
News October 15, 2025
మేడ్చల్, రంగారెడ్డిని సపరేట్ చేసేదే మూసీ

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ఉద్భవించిన మూసీ ప్రతాపసింగారం గుండా పరుగులు పెడుతోంది. ఇక్కడి భౌగోళిక ప్రత్యేకతలో ఈ నది విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. తూర్పు, దక్షిణం దిశలుగా ముచుకుందా(మూసీ) ప్రవహిస్తోంది. సుమారు 4.5 కి.మీ. పొడవున తీరరేఖను ఏర్పరుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దుగా ఈ నది ఉంది. నల్లగొండ జిల్లా వాడపల్లి ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తోంది.
News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.