News March 4, 2025
HYD: ‘దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్’

మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో దళితుడిని సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. BRS దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, పింక్ బుక్ ఓపెన్ చేస్తే కవిత చేసిన స్కామ్లే పాములై బయటకొచ్చి కాటేసే ప్రమాదం ఉందన్నారు.
Similar News
News December 1, 2025
CSIR-IHBTలో ఉద్యోగాలు

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News December 1, 2025
AP న్యూస్ రౌండప్

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్ను టూరిజం, ఇండస్ట్రీస్తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆలయాల్లో రద్దీపై ప్రత్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
News December 1, 2025
ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాను: MP

రామగుండం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడును సోమవారం ఢిల్లీలో కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈనెల 3, 4 తేదీలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం రామగుండం ప్రాంతాన్ని సందర్శించి, కొత్త ల్యాండ్ సర్వే చేస్తుందన్నారు. భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.


