News February 11, 2025
HYD: దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్లోని నాచారానికి చెందిన వారు మృతి చెందడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
Similar News
News November 9, 2025
HYD: KTRను చెత్తకుండికి కట్టేయండి: CM రేవంత్

జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ‘చెత్త’ చుట్టూ రాజకీయం ఆగడం లేదు. తాజాగా CM రేవంత్ KTRకు కౌంటర్ వేశారు. ‘ఆడ చెత్త ఉంది.. ఈడ చెత్త ఉంది అంటున్నారు. 3 సార్లు BRS MLA ఉండు. మున్సిపల్ మిన్సిస్టర్ KTR, MPగా కిషన్ రెడ్డి ఉండు. ఇన్నేళ్లు ఏం చేశారు? తోడు దొంగలు మీరే. మా ప్రాతినిథ్యం లేని చోట జవాబు చెప్పమనడం ఏంటి?. చెత్తకుండిని చూసి KTRను అక్కడ కట్టేయండి. ఆయనకు తత్వం అయినా బోధపడుతది’ అంటూ CM వ్యాఖ్యానించారు.
News November 9, 2025
HYD: అమ్మాయిలతో అసభ్యంగా రీల్స్.. జాగ్రత్త!

SMలో పిచ్చి పిచ్చి రీల్స్ పోస్ట్ చేసేవారిపై HYD పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యువతితో రొమాన్స్ చేస్తూ ఆటో నడిపిన ఘటనపై చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్లేస్లో అసభ్యకరమైన చేష్టలతో రీల్స్ చేసి SMలో అప్లోడ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్లో పరువు పోయేలా వికృత రీల్స్ చేసి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కించకండి. SHARE IT
News November 9, 2025
జూబ్లీ బైపోల్: ఓటర్లు, పోలింగ్ బూత్ల వివరాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య: 4,01,365. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద రెండంచల భద్రత ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నికలో 58 అభ్యర్థులు(+నోటా) పోటీ చేస్తున్నారు. INC-BRS-BJP మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.


