News November 11, 2024

HYD: దేవాలయాల పరిరక్షణకు సీసీ కెమెరాలు

image

దేవాలయాల పరిరక్షణకు నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ అన్నారు. దేవాలయాల వద్ద ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. దేవాలయాల పరిరక్షణకు నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ స్వామి, చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, సంతోష్ నగర్ ఏసీపి మహమ్మద్ గౌస్, ఐఎస్ సదన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజులు ఉన్నారు.

Similar News

News November 21, 2025

IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్‌లు

image

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.

News November 21, 2025

దానం డిసీషన్.. ఓవర్ టూ ఢిల్లీ

image

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలకు సంబంధించి MLA దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదించేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గతంలోనే స్పీకర్ కార్యాలయం దానంకు నోటీసులు అందజేసింది. ఆయన స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు పంపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ఢిల్లీ పెద్దలతో దానం చర్చించి నిర్ణయం తీసుకుంటారని టాక్.