News February 1, 2025
HYD: దేశంలోనే రిచెస్ట్ రీజినల్ పార్టీగా బీఆర్ఎస్

దేశంలో రిచ్చెస్ట్ రీజినల్ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు పొందింది. తమ బ్యాంకు ఖాతాల్లో రూ.1,449 కోట్లు ఉన్నట్లు ఆ పార్టీ ఎన్నికల కమిషన్కు తాజాగా నివేదించింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రూ.120.14 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీకి రూ.1,110 కోట్లు ఉండగా.. పార్లమెంట్ఎన్నికలు ముగిసే నాటికి రూ.1449 కోట్లకు చేరుకున్నాయి.
Similar News
News February 16, 2025
HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
News February 16, 2025
HYD: నుమాయిష్కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.
News February 16, 2025
HYDలో ప్రేమికుల రోజు LOVER సూసైడ్

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్నగర్ పోలీసుల వివరాలు.. PSపరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈ మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకున్నాడు. వాలంటైన్డే రోజు ఇలా జరగడం స్థానికంగా విషాదం నింపింది.