News July 20, 2024

HYD: దేశంలోనే NO.1 సీఎం రేవంత్ రెడ్డి: మల్లు రవి

image

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలోనే నంబర్-1 సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి అన్నారు. HYD గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. కేవలం 7నెలల్లోనే ప్రజల కోసం ఎన్నో పనులు చేశారన్నారు. BRSపదేళ్లు అధికారంలో ఉన్నా రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు.

Similar News

News November 27, 2025

HYD: SSC JE ఎగ్జామ్ దరఖాస్తు చేశారా!

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారికి HYD రీజియన్ అధికారి డా.ప్రసాద్ ముఖ్య సూచన చేశారు. ఎగ్జామ్స్ స్లాట్ సెలక్షన్ చేసుకుని అభ్యర్థులు లాగిన్ ఆప్షన్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఓపెన్ చేసి HYD ఎగ్జామ్ సిటీ లొకేషన్ ఎంచుకోవాలని సూచించారు. ఎంపిక కోసం DEC 28 వరకు గడువు ముగుస్తుందని తెలిపారు.

News November 27, 2025

ఇకనుంచి జలమండలిలో వాటర్ ఆడిట్‌: ఎండీ

image

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్‌లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

News November 27, 2025

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

image

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం న్యాయవేదికను కదిలించింది. 54 ప్రాణాలు బలిగొన్న ఘోర విషాదం ఇంకా స్పష్టమైన నిజానిజాలు లేకుండానే సాగిపోతుందని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీ నివేదికలు, సాక్షాలు, చట్టపరమైన లోపాలన్నీ ముందుంచినా దర్యాప్తు పురోగతి శూన్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వచ్చేనెల 9కి వాయిదా వేసింది.