News July 7, 2024

HYD: దోస్తు మూడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు

image

దోస్తు మూడో విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లను మార్చుకుని మూడో విడతలో మరో కాలేజీలో సీట్లు పొందారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, కళాశాల విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 1,54,246 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు.

Similar News

News October 19, 2025

RR: భారీగా తగ్గిన అప్లికేషన్స్.. గడుపు పొడిగింపు

image

వైన్స్ టెండర్ల గడువు ఈనెల 23 వరకు పొడిగించారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు సుమారు 13,300పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సరూర్‌నగర్ డివిజన్‌లో 138 వైన్స్ షాపులకు 7,000, శంషాబాద్ డివిజన్‌లో 111 షాపులకు 6,300లకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది జిల్లాలో 21,665 దరఖాస్తులు రాగా రూ.4.32 కోట్ల ఆదాయం సమకూరింది.

News October 19, 2025

నేడు HYDలో సీఎం పర్యటన వివరాలిలా..

image

నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతల్లో పర్యటించనున్నారు. ఉ.11.30కు చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమల్లో హాజరవుతారు. 12 గంటలకు NTR స్టేడియం ఎదురుగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు అందించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.

News October 19, 2025

‘ఆట’ విడుపు.. క్రికెట్‌తో సేదదీరిన హైడ్రా సిబ్బంది

image

హైడ్రా సిబ్బంది శనివారం ఫతుల్‌గూడలోని క్రీడామైదానంలో ఫ్లడ్‌లైట్ల కాంతిలో క్రికెట్ ఆడుతూ సేదతీరారు. అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల మధ్య జట్ల పోటీ ఉత్సాహంగా సాగింది. కమిషనర్ రంగనాథ్, అదనపు కమిషనర్లు అశోక్ కుమార్, సుదర్శన్, డైరెక్టర్ వర్ల పాపయ్య పాల్గొన్నారు. క్రీడలు జట్టు స్ఫూర్తిని పెంచుతాయని కమిషనర్ అన్నారు.