News March 19, 2024
HYD: ధర్మ సమాజ్ పార్టీ ఇన్ఛార్జుల నియామకం

ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి తెలంగాణలోని వివిధ పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జులను పార్టీ అధ్యక్షుడు డా.విశారదన్ మహారాజ్ మంగళవారం ప్రకటించారు. మెదక్- అన్నెల లక్ష్మణ్, భువనగిరి-దుర్గాప్రసాద్, సికింద్రాబాద్-వినోద్ కుమార్, చేవెళ్ల-రాఘవేంద్ర ముదిరాజ్, కరీంనగర్- చిలువేరు శ్రీకాంత్, నిజామాబాద్-కండెల సుమన్, హైదరాబాద్- గడ్డం హరీశ్ గౌడ్, వరంగల్ – మేకల సుమన్, మహబూబాబాద్ -రవ్వ భద్రమ్మ, మహబూబ్ నగర్ -రాకేష్.
Similar News
News December 16, 2025
IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
News December 16, 2025
HYD: ‘చే’ చివరిపోరుకు ‘బొలీవియా డైరీ’ రూపం

‘బొలీవియా డైరీ’లో చేగువేరా చివరి రోజులు, గెరిల్లా పోరాటం, <<18569067>>విప్లవంపై<<>> ఆయన అచంచల నిబద్ధత.. హృదయాన్ని ఇందులోని అక్షరాలు కదిలిస్తాయి. ఆకలి, వ్యాధులు, ద్రోహం, అపజయాల మధ్య వెనకడుగు వేయని విప్లవ ఆత్మ ప్రతి పుటలో ఉప్పొంగుతుంది. విజయానికి మించిన సిద్ధాంత విశ్వాసమే చేగువేరా జీవన తత్వంగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం పర్సనల్ డైరీ కాదు.. ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక అమర పుట. ఇది యువతను ఆలోచింపజేసే రచన.
News December 16, 2025
డేంజర్లో హైదరాబాద్

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.


