News March 29, 2024

HYD: నకిలీ వజ్రాన్ని విక్రయిస్తున్న ముఠా ARREST

image

రూ.3 కోట్ల విలువైన వజ్రాన్ని రూ.30 లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను HYD పాతబస్తీ హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.సౌత్‌వెస్ట్‌ DCP ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన బాలచంద్ర తులేరే(48), పాతబస్తీకి చెందిన ముస్తాబా అహ్మద్‌ఖాన్‌, సాజిద్‌ అలీతో కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

Similar News

News December 2, 2025

హైదరాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ

image

తెలంగాణ రైజింగ్ విజన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు, వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవ్‌గణ్ ఫ్యూచర్ సిటీలో తన ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతో M0U చేసుకోనున్నట్లు సమాచారం.

News December 2, 2025

HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

image

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News December 2, 2025

HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఖాజాగూడా చెరువు ఎఫ్‌టి‌ఎల్ పరిధిలో 8 భారీ టవర్స్ అక్రమంగా నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, మురళి నాయక్, రాకేష్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, బిల్డర్లకు నోటీసులిచ్చింది.