News February 24, 2025

HYD: నయన మనోహరంగా కూచిపూడి రంగ ప్రవేశం

image

సంపూర్ణ ప్రత్యక్ష, ఆర్‌కెస్ట్రాతో లక్ష్య రాచప్రోలు కూచిపూడి రంగ ప్రవేశం నయన మనోహరంగా జరిగింది. రవీంద్రభారతిలో త్రిష్ట కూచిపూడి ఆరాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రముఖ నాట్య గురువు డా.అలేఖ్య పుంజాల శిష్యురాలు లక్ష్య రాచప్రోలు కూచిపూడి అరంగేట్రం చేశారు. మహాగణపతిని స్మరిస్తూ ప్రదర్శనకు శుభారంభం పలికి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సృజన అమ్మ ఆనంద గాయనితో ప్రేక్షకులను కట్టిపడేశారు.

Similar News

News December 3, 2025

WGL: రెబల్స్‌ను బుజ్జగింపులు.. వేడెక్కిన రాజకీయాలు!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ కాగా, పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేయడంతో పలు గ్రామాల్లో గట్టి పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి తప్పుకో భవిష్యత్తులో అవకాశం ఇస్తాం అంటూ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్వతంత్రులు బలంగా ఉండటం రాజకీయ సమీకరణాలను మార్చుతోంది.

News December 3, 2025

జిల్లా కేంద్రంగా రాజంపేట.. అర్హతలు ఇవే: JAC

image

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి ఉన్న అర్హతలను JAC వివరించింది.
☛ 18 ఎకరాల విస్తీర్ణంలో సబ్ కలెక్టరేట్
☛ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన నాటినుంచి పార్లమెంట్ కేంద్రం
☛ వివిధ నగరాలకు రైళ్ల సదుపాయం
☛ కృష్ణపట్నం ఓడరేవుకు కనెక్టివిటీ
☛ కడప, రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సమీపం
☛ చెయ్యేరు, పెన్నా నదులు ప్రవహించడం
<<18453435>>CONTINUE..<<>>

News December 3, 2025

WGL: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో 564 జీపీలు, 4,896 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఈ నెల 5 వరకు అవకాశం ఉంది. స్క్రూటినీ 6న పూర్తి చేసి, ఉపసంహరణకు డిసెంబర్ 9 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.