News November 5, 2024
HYD: నాంపల్లి క్రిమినల్ కోర్టుకు దీపాదాస్ మూన్షీ

నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హాజరయ్యారు. దీపా దాస్పై BJP నేత ప్రభాకర్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఆయనపై దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసు వేసింది. దీపాదాస్తో పాటు కోర్టుకు బీజేపీ నేత ప్రభాకర్ హాజరయ్యారు. మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.
Similar News
News October 27, 2025
HYD: కొమురం భీమ్కు బీజేపీ ఘన నివాళులు

గిరిజన వీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు HYD నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురం భీమ్ త్యాగం, ధైర్యం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, Ex MP.ప్రొ.సీతారాం నాయక్, ST మోర్చా అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
News October 27, 2025
HYDలో యాక్సిడెంట్ BLACK SPOTS..!

HYDలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్ను నేషనల్ యాక్సిడెంట్ సర్వే (NAS) గుర్తించింది. బోయిన్పల్లి, తాడ్బండ్, డైరీ ఫార్మ్, బహదూర్పుర, ఎంజీ మార్కెట్, అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల జంక్షన్లు అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలుగా నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయంది.
News October 27, 2025
HYD: మనిషి లేకుండా రోబోలతోనే వ్యవసాయం: వీసీ

మానవ రహిత వ్యవసాయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని HYD రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ VC జానయ్య తెలిపారు. ఆకుకూరల కోత, సంరక్షణ కోసం రూపొందించిన రోబోలు ఈ దిశగా కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.రోబోటిక్ టెక్నాలజీతో వ్యవసాయంలో సమయాన్ని, శ్రమను ఆదా చేయడంతోపాటు దిగుబడి పెంపు సాధ్యమవుతుందన్నారు.


