News April 10, 2025

HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

image

అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.

Similar News

News December 22, 2025

తణుకు: బియ్యపు గింజపై బంగారంతో వైఎస్ జగన్ పేరు

image

మాజీ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తణుకుకు చెందిన సూక్ష్మ కళాకారుడు భవిరి నాగేంద్రకుమార్ తన ప్రతిభ చాటుకున్నారు. 0.030 పాయింట్ల బంగారంతో బియ్యపు గింజపై జగన్ పేరును తీర్చిదిద్దారు. సుమారు మూడు గంటల సమయం వెచ్చించి దీనిని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నాగేంద్ర కుమార్ నైపుణ్యాన్ని స్థానికులు, వైసీపీ నేతలు మెచ్చుకున్నారు.

News December 22, 2025

ఆరావళి పర్వతాలపై కేంద్రం క్లారిటీ

image

ఆరావళి పర్వతాలలో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చారని వస్తున్న <<18631068>>ఆరోపణల<<>>పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఆరావళి పర్వతాల మైనింగ్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.

News December 22, 2025

కడప: వాసుకు మరో ఛాన్స్ ఎందుకు లేదంటే?

image

TDP కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగిన శ్రీనివాసులరెడ్డిని తిరిగి కొనసాగించలేదు. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.
➤ జిల్లాలో కడప నియోజకవర్గానికే పరిమితం కావడం
➤ ఇక్కడా నాయకుల సమన్వయంలో విఫలం
➤ ముక్కుసూటిగా ప్రవర్తించడం
➤ కడప ఎమ్మెల్యేపై వ్యతిరేకత
➤ పార్టీలో ఒకరికే పదవి అని లోకేశ్ చెప్పడం
➤ యువకులను ముందుకు తీసుకురావలన్న TDP ఆలోచన.