News April 10, 2025

HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

image

అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.

Similar News

News December 12, 2025

విశాఖ నుంచి సేవలు అందించనున్న IT సంస్థలు

image

AP: CM CBN కాగ్నిజెంట్ సహా 8 IT సంస్థల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ నిర్మాణం 3 దశల్లో పూర్తి కానుంది. కాగా ఈ సంస్థలన్నీ విశాఖ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. వీటి ద్వారా రాష్ట్రానికి ₹3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇప్పటికే VSP నుంచి 150కి పైగా కంపెనీలు సేవలందిస్తున్నాయని, ఐటీ నిపుణులకు అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది.

News December 12, 2025

విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

image

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్‌ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

News December 12, 2025

ప్రభుత్వ టీచర్ ఆదర్శం!

image

➤ తన బిడ్డకూ అదే బడి
SS: గవర్నమెంట్ టీచర్ తన కుమారుడినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రానికి చెందిన స్వర్ణ సోమందేపల్లి మండలంలోని కొలిమిపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన కుమారుడు సాత్విక్‌ను ఇదే పాఠశాలలో చదివిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందనడానికి ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు.