News April 10, 2025
HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.
Similar News
News December 24, 2025
జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలిజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. ఏసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడని, గొప్ప శాంతి దూత అని కొనియాడారు.
News December 24, 2025
హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారా?

హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినడం, పొడిబారడం, తెగిపోవడం వంటివి జరుగుతాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఈ ప్యాక్స్ పాటించండి. * చల్లార్చిన టీ డికాషన్ను జుట్టుకు పట్టించి టవల్తో చుట్టేయాలి. పావుగంట కడిగేస్తే సరిపోతుంది. * తలస్నానం తర్వాత కండిషనర్, ఎప్సం సాల్ట్ కలిపి తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా అవుతుంది.
News December 24, 2025
వేప చెట్లు ఎందుకు నిర్జీవంగా కనిపిస్తున్నాయి?

పంటలను చీడపీడల నుంచి కాపాడే వేప చెట్లే తెగుళ్ల బారినపడటం కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వేప చెట్ల కొమ్మలు, రెమ్మలు మాడి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఫోమోప్సిస్ అజాడిరక్టే ఫంగస్ వల్లే ఇలా జరుగుతున్నట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఇది ఒక చెట్టు నుంచి మరో చెట్టును ఆశిస్తోంది. అయితే ఇది ఏడాదిలో కొంతకాలం పాటే చెట్లకు సోకుతుందని, మళ్లీ ఈ చెట్లు కోలుకొని మళ్లీ పచ్చగా మారతాయని చెబుతున్నారు.


