News April 10, 2025
HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.
Similar News
News December 18, 2025
రాజానగరం: రేపు నన్నయకు రానున్న నారా లోకేశ్

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాలను శుక్రవారం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారని వీసీ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. గురువారం జేసీ వై. మేఘా స్వరూప్తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఇంజినీరింగ్, ఎగ్జామినేషన్స్, స్కూల్ ఆఫ్ కామర్స్ భవనాలను మంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇదే వేదికపై రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వీసీ తెలిపారు.
News December 18, 2025
BREAKING: ఓజిలి MRO, VRO సస్పెండ్

ఓజిలి(M) వీర్లగుణపాడులో భూ ఆక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూమిగా చూపిస్తూ తప్పుదారి పట్టించే ఎండార్స్మెంట్లు జారీ చేసినందుకు MRO ఏ.పద్మావతిని అధికారులు సస్పెండ్ చేశారు. రెవెన్యూ రికార్డులు, ఫీల్డ్ పరిశీలనలను పక్కనపెట్టి పరస్పర విరుద్ధంగా VRO నివేదికలపై ఆధారపడినట్టు విచారణలో తేలింది. దీంతో వీఆర్వోను సైతం సస్పెండ్ చేశారు.
News December 18, 2025
మఠంపల్లి: సుతారి మేస్త్రీ నుంచి సర్పంచిగా..

మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఓ సామాన్యుడు సర్పంచిగా గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. మఠంపల్లి మం. పెదవీడు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అమరవరపు వెంకటేశ్వర్లు 250ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఆయన మళ్లీ బరిలో నిలిచారు. గ్రామాభివృద్ధికి తోడ్పడే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్మికుడు సర్పంచిగా ఎన్నికవ్వడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.


