News September 25, 2024
HYD: నిండుకుండలా హుస్సేన్సాగర్

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. ట్యాంక్బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్కు వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.
Similar News
News September 13, 2025
HYD: అందరూ ఈ 9000113667 నంబర్ సేవ్ చేసుకోండి..!

గ్రేటర్ HYDలో మూతలేని మ్యాన్ హోళ్లు చాలా చోట్ల మీకు కనిపిస్తాయి. అందులో ఎవరైనా పడి ప్రమాదాలకు గురి కావచ్చు. అందుకే మూతలేని మ్యాన్ హోల్ను మీరు చూస్తే వెంటనే 9000113667 నంబర్కు ఫోన్ చేసి సమాచారమివ్వండి. హైడ్రా అధికారులు తక్షణం స్పందించి దానికి మూతను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ విషయం మీ మిత్రులు, సన్నిహితులకు కూడా షేర్ చేయండి. SHARE IT
News September 13, 2025
HYD: స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణ నుంచి తప్పుకుంటున్న GHMC!

నగరంలో చాలా చోట్ల GHMCకి స్పోర్ట్స్ కాంప్లెక్సులు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణ భారంగా అనిపించిందో, లేక ఆదాయం పొందాలని అనుకుంటోందో తెలియదు కాని మెయింటెనెన్స్ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. సిటీలో ఉన్న పలు స్పోర్ట్స్ కాంప్లెక్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నడుం బిగించింది. రెండేళ్లపాటు వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు కూడా పిలిచింది. మొదటి దశలో 9 కాంప్లెక్సులను అప్పగించనుంది.
News September 13, 2025
సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.