News August 14, 2024

HYD: నిమ్స్‌లో ఏడాదిలో 300 రోబో చికిత్సలు

image

రోబో చికిత్సలు ప్రవేశపెట్టిన ఏడాదిలోనే 300 వరకు శస్త్రచికిత్సలు చేసిన అరుదైన ఘనతను నిమ్స్ వైద్యులు సొంతం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న పేద రోగులకు ఉచితంగా, ఇతర రోగులకు తక్కువ ఖర్చుతోనే ఈ సేవలందిస్తున్నారు. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు పరిమితమైన ఈ రోబోటిక్ సేవలను గతేడాది ఆగస్టులో దాదాపు రూ.30 కోట్లతో నిమ్స్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఎక్కువ శాతం ఈ సేవలు పేదలకే అందుతున్నాయి.

Similar News

News October 21, 2025

HYD: ఎన్నికల పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఓం ప్రకాశ్ త్రిపాఠి(IPS), ఇక వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ నియమితులయ్యారు.

News October 21, 2025

BREAKING: జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో KCR

image

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి BRS పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రచారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCR పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఆయనతో సహా పార్టీ తరఫున ప్రచారంలో 40 మంది ప్రముఖులు పాల్గొంటారు. మాజీ మంత్రులు KTR, హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.

News October 21, 2025

పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అంబర్‌పేట్ కార్ హెడ్‌క్వార్టర్‌లో సీపీ సుధీర్ బాబు, డీసీపీలు, సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని తెలిపారు.