News September 18, 2024

HYD: నీటి వారోత్సవాల్లో మంత్రి ఉత్తమ్

image

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నేడు జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 8వ అంతర్జాతీయ నీటి వారోత్సవ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా నీటి నిర్వహణ, అభివృద్ధి, సహకారంపై కీలకమైన అంశాలపై చర్చించారు. జలవనరుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి ప్రదర్శించారు.

Similar News

News November 8, 2025

జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

image

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్: ఓట్ల కోసం ఇంతకి దిగజారుతారా?: BRS

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. సునీత.. గోపీనాథ్ 3వ, 4వ భార్యనా అని అనుమానిస్తున్నారు.. ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఓ మహిళపై దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ విషయం స్పందించాలని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: మీకేం కావాలి? ఎంత కావాలి?’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రేపటితో క్లోజ్. ఇక వీధులు, బస్తీలు నిర్మానుష్యంగా మారుతాయి. సీన్ కట్ చేస్తే ప్రధాన నాయకుల ఇళ్లకు, గెస్ట్ హౌసులకు షిఫ్ట్ అవుతుంది. ప్రచారం ముగియగానే మంతనాలు షురూ అవుతాయి. గంపగుత్తగా ఓట్లు వేయించే వారిని ఇంతకుముందే గుర్తించిన నాయకులు వారితో రేపు చర్చలు జరిపే అవకాశముంది. ప్రతీ ఎన్నికల ముందులాగే.. మీకేం కావాలి? ఎంత కావాలి? అంటూ ప్రలోభపెడుతూ ఓట్లు రాబట్టుకునే పనిలో ఉంటారు.