News January 22, 2025

HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర

image

HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.

Similar News

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్: 22 కిలో మీటర్ల మార్గంలో పోలీసుల తనిఖీలు

image

గ్లోబల్ సమ్మిట్ కోసం భద్రత అసాధారణ స్థాయికి చేరింది. తుక్కుగూడ నుంచి మీర్ఖాన్​పేట్ వరకు ఉన్న 22KM మార్గంలో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు అణువణువూ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఆరు ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 24 నుంచే ప్రధాన భద్రతాధికారి హై అలర్ట్ ప్రకటించి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News December 4, 2025

HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

image

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.

News December 4, 2025

HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

image

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్‌లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్‌నగర్‌లో ఆయన Way2Newsతో మాట్లాడారు.