News January 13, 2025
HYD: నుమాయిష్కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది

HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Similar News
News February 25, 2026
HYD: ఎగ్జామ్కు READY అయ్యారా?

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 1,75,271 మంది విద్యార్థులు 217 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తారు. 1st ఇయర్లో 81,898 మంది, 2nd ఇయర్లో 93,373 మంది ఉన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు CC రూమ్కు అనుసంధానించారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
News February 24, 2026
Trending: HYDలో అంతాక్షరీ 2.O!

చిన్నప్పుడు మనం ఫ్రీగా ఆడిన అంతాక్షరీ ఇప్పుడు ‘మ్యూజికల్ జామింగ్’ (Musical Jamming) పేరుతో కొత్త రూపం దాల్చింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ కేఫ్స్లో వారాంతాల్లో ఈ సెషన్స్ జరుగుతున్నాయి. దీనికోసం జెన్-జీ కుర్రాళ్లు ఒక్కొక్కరు రూ.499 నుంచి రూ.999 వరకు టికెట్ కొని మరీ వెళ్తున్నారు. పాత పాటలకే కొత్త ట్యూన్లు కట్టి, చప్పట్లు కొడుతూ పాడటమే ఈ ‘పెయిడ్ అంతాక్షరి’ స్పెషాలిటీ. పాత ఆటకి కార్పొరేట్ రేట్ పడింది.
News February 24, 2026
HYD: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఇక చరిత్రే!

రాజేంద్రనగర్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఇక చరిత్రే. 2012 నిబంధనల ప్రకారం 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండటంతో గతంలో అనుమతులున్నా మార్కెట్ రేటు చెల్లించి స్వాధీనం చేసుకుంటామని RDO వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టారు. కిస్మత్పురా, దర్గా, ఉప్పర్పల్లిలో ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 60 రోజుల్లో అభిప్రాయాలు తీసుకొని పారదర్శకంగా ముందుకెళ్తామన్నారు. ఇక 500 మీటర్ల పరిధిలో ఇటుక పెట్టే ఛాన్సే లేదు.


