News February 16, 2025
HYD: నుమాయిష్కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.
Similar News
News March 14, 2025
‘జియో హాట్స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

జియో, స్టార్ నెట్వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్ను చాలామంది యూట్యూబ్లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్స్టార్ భావిస్తోంది. యాప్లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.
News March 14, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
➤ రిపోర్టర్ను బెదిరించి సెల్ ఫోన్ను ఎత్తుకెళ్లిన దుండగులు
➤ సముద్ర స్నానానికి వెళ్లిన ఉపమాక వెంకన్న
➤ ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పిఠాపురం తరలి వెళ్లిన జనసైనికులు
➤ వడ్డాది వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
➤ నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా-ఎలమంచిలి MLA
➤ 21న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై ధర్నా
➤ హోలీ ఉత్సవాల్లో చిన్నారుల సందడి
News March 14, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి జిల్లాలో కనువిందు చేస్తున్న హోళీ పుష్పాలు
>అరకులో హోలీ..కోయ్, కోయ్ ట్రెండ్
>అల్లూరి: లొంగిపోయిన 11మంది మిలీషియా సభ్యులు
>కొయ్యూరు: ఎండల కారణంగా వెలవెలబోతున్న హైవే
>అల్లూరి: ఊబిలో చిక్కుకుని విద్యార్థి మృతి
>అరకు: కాఫీ, మిరియాల రైతులకు బీమా సౌకర్యం కల్పించాలి
>రంపచోడవరం: న్యాయవాదుల కీలక తీర్మానం
>మోదకొండమ్మ ఉత్సవాలకు నిధులు తెచ్చేందుకు కృషి