News February 17, 2025

HYD: నుమాయిష్‌ ఈరోజు లాస్ట్

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్‌ నేటితో ముగియనుంది. ఆదివారం సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్‌లో వందల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రూ. 50 ఎంట్రీ ఫీజు ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం. నగరవాసులు చివరిరోజు పోటెత్తే అవకాశం ఉండడంతో తగు ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 17, 2026

HYD: నేటి నుంచే ’24 స్పీడ్ పోస్ట్’ సేవలు..!

image

తక్షణ, అత్యవసర డెలివరీల కోసం ఇండియా పోస్ట్ నేటి నుంచి 24, 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలను ప్రారంభించనుంది. మొదటి దశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో అందుబాటులోకి రానున్న ఈ సేవలు ఒకటి నుంచి రెండు రోజుల్లో వస్తువులను చేరవేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో OTP ఆధారిత సెక్యూర్ డెలివరీ, SMS ట్రాకింగ్, ఆలస్యమైతే డబ్బు తిరిగి ఇచ్చేసే వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

News March 17, 2026

HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

image

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.

News March 17, 2026

HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

image

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.