News May 24, 2024
HYD: నూతన చట్టాలు భద్రతకు మైలురాయి: రాచకొండ సీపీ

త్వరలో అమల్లోకి రానున్న నూతన చట్టాలు మన దేశ శాంతి భద్రతల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తాయని రాచకొండ CP తరుణ్ జోషి అన్నారు. జులై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి RCIలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలతో కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.
Similar News
News December 6, 2025
HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.
News December 6, 2025
HYD: మహా GHMCలో 250 డివిజన్లు.!

గ్రేటర్లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.
News December 6, 2025
HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.


