News November 26, 2024
HYD: నెమళ్ల సంఖ్య గతేడాది 565.. మరి ఈ ఏడాది..?

నగరంలో పేరుగాంచిన KBR పార్కులో నెమళ్ల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుకుంటే వచ్చేనెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే. జాతీయ పక్షులు పార్కులో ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ వివరాలను డిసెంబర్ 3వ తేదీ ప్రకటిస్తామని పార్క్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది KBR పార్కులో 565 నెమళ్లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
Similar News
News October 20, 2025
నగరంలో దీపావళిపై ఆర్టిఫిషియల్ వెలుగులు

దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించే ఆచారం ఇప్పుడు నగరంలో తగ్గుముఖం పడుతోంది. కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, బాలానగర్, కూకట్పల్లి, బేగంబజార్లో విక్రయిస్తున్న ఆర్టిఫిషియల్ లైట్లే ఆకర్షిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఆన్లైన్లో లభించే వివిధ ఆకృతుల దీపాలతో ఇళ్లు అలంకరిస్తున్నారు. మట్టి ప్రమిద అజ్ఞానం తొలగించి జ్ఞాన వెలుగు ప్రసరింపజేయాలనే భావనతో వచ్చిన సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు.
News October 20, 2025
HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

ప్రగతినగర్లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్ఛార్జికి చెప్పారు. కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.
News October 20, 2025
ఖైరతాబాద్లో రేపు సాయంత్రం సదరోత్సాహం

ఖైరతాబాద్లో రేపు సదర్ సందడి ఉంటుంది. సా.7 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ వద్ద ఈ వేడుక నిర్వహిస్తారు. దీపావళి పండుగ మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని.. 8 దశాబ్దాలుగా సదర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళారపు చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు. స్థానికులు వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.