News February 19, 2026

HYD: నెల రోజులు రెక్కీ చేసి.. దారుణ హత్య

image

వనస్థలిపురం PS పరిధిలో వివాహిత హత్య జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. BNరెడ్డి కప్పలచెరువు వద్ద గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత(30)కు 2022లో నిందితుడు మహేశ్(30)తో వివాహమైంది. గొడవల వల్ల 2024లో విడాకులు తీసుకుని 2025 ఏప్రిల్‌లో శ్రీనాథ్‌ను రెండో వివాహం చేసుకుందన్న కోపంతో నెల నుంచి రెక్కి నిర్వహించి బుధవారం పథకం ప్రకారం చంపేశాడని సీఐ తెలిపారు.

Similar News

News March 17, 2026

HYD: భారీగా పెరిగిన ధరలు.. అడ్డుకోరా!

image

వాణిజ్య గ్యాస్ కొరత సాకుతో నగరంలో హోటల్ తిండి హోరెత్తుతోంది. టీ కప్పు నుంచి టిఫిన్ ప్లేట్ దాకా HYDలో ₹5- ₹10 వరకు పెంచేసిన హోటళ్లు.. గ్యాస్ సరఫరా చక్కబడినా ధరలు తగ్గిస్తారన్న గ్యారెంటీ లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో ధరలు పెరిగినా మళ్లీ కిందికి రాలేదు. ఉదాహరణకి ‘ఆనియన్ సలాడ్’! ఈ భారమంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి జీవుల మీదే పడుతోందంటున్నారు. ఈ దోపిడీని అడ్డుకోరా?

News March 17, 2026

HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

image

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్‌దుర్గ్, అమీర్‌పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్‌తో బాగోతం బయటపడింది.

News March 17, 2026

HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

image

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్‌దుర్గ్, అమీర్‌పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్‌తో బాగోతం బయటపడింది.