News October 4, 2024

HYD: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటన

image

PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటి నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు. ఆయన వెంట ఎనిమిది మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారని తెలిపారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌ గెలుపు.. కలిసొచ్చినవి ఇవే!

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపునకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో అతి ముఖ్యమైనవి పరిశీలిస్తే..
1.రేసుగుర్రం నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం (కలిసొచ్చిన స్థానికత)
2.స్టార్ క్యాంపెయినర్‌గా CM ప్రచారం (ప్రజల్లో చైతన్యం)
3.అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం(మైనార్టీలు INCకి మొగ్గు)
4.MIM మిత్రపక్షం
5.గల్లీల్లో మంత్రుల పర్యటన.. బస్తీల్లో అభివృద్ధి మంత్రం
6.పోలింగ్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్

News November 14, 2025

HYD: BRSను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తున్నారా అని ఇటీవల KTR అన్నారని, కచ్చితంగా భావిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ఆధిక్యంపై ఆయన మాట్లాడారు. ప్రజాపాలన వైపు ప్రజలు ఉన్నారన్న దానికి ఇది నిదర్శనమన్నారు. BRSను ప్రజలు నమ్మడం లేదని, అది ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. అభివృద్ధికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, తాము బీసీ బిడ్డకు టికెట్ కేటాయించామన్నారు.

News November 14, 2025

45 వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్

image

ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని ఆశించారు. 45 వేల మెజారిటీతో గెలుస్తున్నామని నవీన్ యాదవ్ తెలిపారు. అయితే, ఆయన ఆశించిన స్థాయిలోనే 4 రౌండ్లలో INC లీడ్‌లో ఉంది.