News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Similar News
News December 22, 2025
ఫాక్స్కాన్ రికార్డు.. ఏడాదిలో 30 వేల మందికి ఉద్యోగాలు!

బెంగళూరులోని ఫాక్స్కాన్ 2025లో రికార్డు స్థాయిలో 30 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. వీరిలో 80% మంది మహిళలే. ఇండియాలో ఐఫోన్ల అసెంబ్లీకి కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. నవంబరులో యాపిల్ ఏకంగా 2 బి.డాలర్లు విలువ చేసే ఫోన్లను ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసింది.
News December 22, 2025
ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ 100పోస్టులకు నోటిఫికేషన్

<
News December 22, 2025
మొటిమల మచ్చలు తగ్గట్లేదా?

వాతావరణం, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది అమ్మాయిలు మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలు, వాటి వల్ల వచ్చిన నల్లటి మచ్చలు తగ్గించడానికి చింతపండు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చింతపండు గుజ్జులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత ముఖాన్ని కడిగితే చాలు. అలాగే చింతపండు గుజ్జులో అరటిపండు, శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మం క్లీన్ అవుతుంది.


