News January 27, 2025

HYD: నేడు హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి

image

HYD బుద్ధభవన్‌లో గల హైడ్రా కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గం. వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలు తదితర అంశాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కాగా.. ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News December 6, 2025

HYD: అడ్డూ అదుపు లేకుండా థియేటర్ల దోపిడీ.!

image

HYD మహానగరంలో సినిమా థియేటర్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. టికెట్ ధరతో సమానంగా.. కూల్ డ్రింక్స్, పాప్కాన్ పేరుతో దోచేస్తున్నారు. MRP ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో సినిమాకు వచ్చేవారు జేబులు గుల్లవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా డబ్బులు గుంజుతున్నారు. థియేటర్లకు రావాలంటేనే మధ్యతరగతి కుటుంబం బెంబేలెత్తిపోతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

News December 6, 2025

హైదరాబాద్‌లో హారన్ మోతలకు చెక్.!

image

హైదరాబాద్‌లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్‌ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

News December 6, 2025

HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

image

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.